| 1. గ్రహాంతరవాసులు, దేవదూతలు
లేదా దత్తపుత్రులు : దేవుని కుమారులు ఎవరు? |
| 2. దేవదూతలు ఆత్మలు |
| 3. అంతరిక్ష సంబంధమైన జీవితమా? |
| 4. గ్రహాల యువరాజులు |
| 5. నీతికి వారసులు |
| 6. నరుల కుమార్తెలు |
| 7. అన్యమత వివాహములు |
| 8. బహుభార్యాత్వము |
| 9. ఒక పెద్ద సమస్య |
| 10. దత్తత ఎంపికలు |

గ్రహాంతరవాసులు, దేవదూతలు లేదా దత్తపుత్రులు : దేవుని కుమారులు ఎవరు?
అక్టోబర్ 30, 1938. ఇది హాలోవీన్ (లేదా, ఆల్ సెయింట్స్| ఈవ్ అని కూడా పిలువబడే హాలోవీన్, అక్టోబర్ 31న అనేక పాశ్చాత్య దేశాలలో జరుపుకునే వేడుక) ముందు రాత్రి, మరియు చాలా మంది అమెరికన్లు తమ రేడియోలను కొలంబియా బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్క ట్యూన్ చేస్తున్నారు, ఇది వాతావరణంపై సమాచారము పూర్తి చేసి సంగీతం వినిపించడం ప్రారంభించింది. క్షణాల్లో, మార్స్ (అంగారకుడు లేదా కుజ గ్రహం) మీద వింత పేలుళ్ల గురించి వార్తల తాజా ప్రసారానికి అంతరాయం కలిగింది. మరింత సమాచారం అందుబాటులోకి రావడంతో మరిన్ని ప్రకటనలు 中చేస్తామని ప్రకటికుడు ప్రేక్షకులకు భరోసా ఇచ్చారు. అప్పుడు సంగీతం కొనసాగింది.
రాత్రి గడిచేకొద్దీ, సంగీతానికి తరచూ, అంతరాయం కలిగింది. ఇప్పుడు ఆక్రమణ యొక్క భయంకరమైన నివేదికలతో. మార్స్ (కుజ గ్రహం) నుండి గ్రహాంతరవాసులు న్యూజెర్సీలో మరియు ప్రపంచంలోని అనేక నగరాల్లో అడుగుపెట్టారు. భూమి పూర్తి స్థాయి దాడికి గురైంది. ప్రసారం వింటున్న చాలా మంది భయపడ్డారు, మరికొందరు కొండల సందుల్లో దాక్కోవడం కోసం తమ ఇళ్లనుండి పారిపోయారు.
కానీ ఇదంతా కల్పన.
ఒక యువ ఓర్సన్ వెల్స్ ప్రసారం కొరకు హెచ్.జి. వెల్స్, పుస్తకం (వార్ ఆఫ్ ది వరల్డ్స్) మ స్వీకరించారు మరియు కధను నిజ సమయంలో జరుగుతున్నట్లుగా ప్రదర్శించడానికి రచనను సవరించారు. చాలా మంది శ్రోతలు కల్పనను నిజమని భావించారు.
భయపడిన వారు అసంపూర్ణ సమాచారంతో పనిచేస్తున్నారు.
ఇది కేవలం నాటకం మాత్రమే అని ప్రసారం ప్రారంభంలో మరియు చివరిలో స్టేషన్ ప్రకటించడాన్ని వారు వినలేకపోయారు. మధ్యలో వస్తూ, కథలో కొంత భాగాన్ని మాత్రమే విన్న వారికి సందర్భం అర్ధం కాలేదు మరియు ఆకాశం పడుతోందని అనుకుంటూ పారిపోయారు.
అదేవిధంగా, అదికాండము పుస్తకంలో ఒక వాక్యం ఉంది, సందర్భానికి సంబంధం లేకుండా చదివినప్పుడు, భూమిని అంతరిక్షం నుండి గ్రహాంతరవాసులు వచ్చి ఆక్రమించారని చాలామంది నమ్ముతారు. ఆ ఆశ్చర్యపరిచే వాక్యాన్ని చూద్దాం
"నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి” (ఆదికాండము 6:1, 2).
ఇది ఆదికాండము నుండి ప్రకటన వరకు బైబిల్ ద్వారా నడుస్తున్న ఒక వాక్యము "దేవుని కుమారులు." కాబట్టి ఇది నిజంగా ఏమి చెబుతుందో మనము అర్ధం చేసుకున్నామా లేదా అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. అవునంటారా?
"దేవుని కుమారులు" అనే మాట గ్రహాంతర ఆక్రమణదారులను సూచిస్తుందని కొందరు నమ్ముతారు. ఈ జీవులు అంతరిక్షం నుండి పడిపోయిన దేవదూతలు లేదా దుష్ట గ్రహాంతరవాసులు అని, వారు మానవ స్త్రీలను భార్యలుగా తీసుకొని కొన్ని ముఖ్యమైన సంతానాలను ఉత్పత్తి చేశారని వారు నమ్ముతారు. ఈ కలయికలు ఉత్పత్తి చేసిన సంతానం “నెఫీలులు” (అసాధారణ ఎత్తుగల బలాఢ్యులు, మర్మమైన జీవులుగా హెబ్రీ బైబిల్లో పేర్కొన్న వ్యక్తులు. వారు పెద్దవారు మరియు బలమైనవారు, నేఫిలిమ్ అనే పదాన్ని కొన్ని ఇంగ్లీషు బైబిళ్ళలో జెయింట్గా అనువదించారు, కొన్ని సాంప్రదాయ యూదు వివరణలు వారిని పడిపోయిన దేవదూతలుగా వ్యాఖ్యానిస్తాయి) (ఆదికాండము 6:4). ఎందుకు అనేదానికి ఇదే వివరణ అని వారు ఈ నమ్మకాన్ని హేతుబద్ధం చేస్తారు. ఈ అక్రమమైన కలయికలు చివరికి జలప్రళయానికి దారితీసిన మనిషి యొక్క దుష్టత్వానికి కారణమని వారు నమ్ముతారు.
కొన్ని బైబిల్ అనువాదాలలో ఒకటి, "నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు-(ప్రకృతికి అతీతమైన జీవులు) నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.” అయితే, ఈ అనువాదం ఆదిమ హెబ్రీతో అంత బాగా సరిపోదు. క్రీస్తు కాలంలో, అపోక్రిఫాల్ (అప్రసిద్ధమైన పౌరాణిక) గ్రంథాలు ఎంతగానో చెలామణిలో ఉన్నాయి, ఈ రచనలలోని కొన్ని వాటిలో ఈ రకమైన వింత వివరణలు కూడా ఉన్నాయి.
ఉదాహరణకు, మీరు హనోకు గ్రంథము గురించి విన్నారా? ఇది బైబిల్లో లేదు, కానీ యూదా గ్రంథములో క్లుప్తంగా ప్రస్తావించబడింది. యూదా రచయిత వాస్తవానికి హనోకు నుండి కొన్ని పంక్తులను ఉటంకించాడు, ఇది క్రీస్తు కాలం నుండి ప్రసిద్ధమైన పౌరాణిక రచన. (ఇది వాస్తవానికి హనోకు రాసినది కాదు.) ఇది మరింత ఆధునిక గ్రంథమైన ది పిల్టిమ్స్ ప్రోగ్రెస్ (యాత్రికుల పురోగతి) కి సమానమైన కల్పిత కథల పుస్తకం.
యూదా హనోకు గ్రంథము నుండి సత్యం యొక్క అంతరార్థాన్ని తీసివేసాడు, కాని హనోకు గ్రంథములోని మిగతా వాటి యొక్క నిజాయితీకి ఇది ఒక ఆమోదంగా చూడకూడదు. అదేవిధంగా, జాన్ బన్యన్ రచనల నుండి ఒక వాక్యము లేదా రెండు వాక్యాలు ఉటంకిస్తూ, ఆత్మతో నిండిన ఉపన్యాసం బోధించవచ్చు. తన ఉపమానాల నుండి సత్యం యొక్క చిన్న అంతరార్థాన్ని పంచుకోవచ్చు. కథలు నిజమని దీని అర్థం కాదు.
గుర్తుంచుకోండి, ఏ క్రైస్తవ మత అధికారం క్యాథలిక్కులు లేదా ప్రొటెస్టంట్లు హనోకు గ్రంథాన్ని వారి విశ్వాసాల తుది నియమావళిలో పెట్టడాన్ని ఎంచుకోలేదు. ఇది నిజం కంటే పౌరాణిక గ్రంథమని వారు గుర్తించారు, మరియు అది ఖచ్చితంగా బైబిలుతో సమాన స్థాయిలో ప్రేరణ పొందలేదు.
ఇప్పుడు మీరు దాని స్థానాన్ని అర్ధం చేసుకున్నారు, దేవుని కుమారుల గురించి హనోకు గ్రంథము చెప్పేది ఇక్కడ ఉంది :
"ఆ దినములలో నరుల కుమారులు విస్తరింప నారంభించిన తరువాత, వారికి సొగసైన మరియు అందంగా జన్మించిన కుమార్తెలు పుట్టిన తరువాత ఇది జరిగింది మరియు దేవదూతలు, పరలోకపు, కుమారులు వారిని చూచినప్పుడు, వారు వారి పట్ల ఆకర్షితులయ్యారు మరియు వారు, మనము మన మనస్సుకు వచ్చినవారిని నరుల కుమార్తెలలో శ్రేష్టమైన వారి నుండి భార్యలుగా ఎన్నుకొని వారితో పిల్లలను కందము రండని ఒకరితో నొకరు చెప్పుకొనిరి” (హనోకు గ్రంథము 7:1).
ఆదిమ తొలి సంఘ నాయకులలో కొందరు ఈ వాక్యాన్ని చదివి, రెండుసార్లు రెప్పపాటు వేశారు, మరియు అది నిజంగా అలా జరిగి ఉండవచ్చునని కనుగొన్నారు. తత్ఫలితంగా, కొంతమంది దేవుని ప్రజలు ఈ కథను వారి నమ్మకాల సమితి నుండి పూర్తిగా కదిలించలేదు. ఏదేమైనా, ఇది తీవ్రంగా పరిగణించినట్లయితే. వాస్తవానికి చాలా ఇతర బైబిల్ బోధలతో అపారమైన సమస్యలను కలిగిస్తుంది.
నిజానికి, ఈ భాగాన్ని అర్థం చేసుకోవడానికి మరో ముఖ్యమైన కారణం ఉంది. అదికాండము 6 లో జరిగే విషయాలు, ముఖ్యంగా మొదటి కొన్ని వచనాలు, నోవహు కాలంలో జలప్రళయము ద్వారా భూమిని నాశనం చేయడానికి దారితీసిన ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. మరియు ఈ విషయాలు మన రోజుల్లో పునరావృతమవుతున్నాయి. కాబట్టి బైబిల్ నిజంగా ఇక్కడ ఏమి చెప్పిందో మరియు ఏమి చెప్పలేదని అర్ధం చేసుకోవడం మనకు మంచిది. పైపైన, "దేవుని కుమారులు" పడిపోయిన దేవదూతలను సూచిస్తున్నారని పేర్కొనడం ఒక చమత్కార ముగింపుగా అనిపించవచ్చు. మనము చూసేటప్పుడు, ఈ భాగాన్ని చుట్టుముట్టే సందర్భం అర్ధం చేసుకోకుండా, మీరు కొన్ని అపోహలు నిజమని నమ్ముతూ గందరగోళానికి గురవుతారు.
లేఖనము మనకు చెప్పే విషయాల గురించి ఎప్పుడైనా గందరగోళం ఉంటే, అది సాధారణంగా సమాచారం లేకపోవడం వల్లనే. మత పెద్దలు పరలోకంలో వివాహం గురించి గందరగోళానికి గురైనప్పుడు, యేసు వారితో, "అందుకు యేసు మీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడుచున్నారు” అని అన్నాడు (మార్కు 12:24). ఇంకో మాటలో చెప్పాలంటే, యేసు ఇక్కడ, "దేవుని వాక్యం మీకు తెలియదు కాబట్టి నేను ఏమి చెప్తున్నానో మీకు అర్ధం కాలేదు" అని అంటున్నాడు. అదృష్టవశాత్తూ, బైబిల్ నుండి కొంచెం ఎక్కువ సమాచారాన్ని సేకరించి, గ్రంథాన్ని గ్రంధంతో పోల్చడం ద్వారా దేవుని కుమారులకు సంబంధించిన ఏదైనా గందరగోళాన్ని మనం చాలా తేలికగా తొలగించవచ్చు.
దేవదూతలు ఆత్మలు
కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీషు బైబిల్, “దేవుని కుమారులు" అనే పదాన్ని 11 సార్లు రెండు ప్రాథమిక మార్గాల్లో ఉపయోగిస్తుంది.
ఏదేమైనా, ఇది దేవదూతను సూచించడానికి ఈ పదాన్ని ఎప్పుడూ ఉపయోగించదు.
"వాయువులను తనకు దూతలుగాను చేసికొనియున్నాడు. `(కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీషు బైబిలు ప్రకారము, "తన దేవదూతలను ఆత్మలను చేయువాడు" (కీర్తన 104:4). దేవదూతలు ఆత్మలు, వారు శరీరులు కాదు. వారు ఇప్పుడు మన చుట్టూ ఉన్నారు. కాని మనము వారిని చూడలేము. వారు సాధారణంగా వారి ఆధ్యాత్మిక రూపంలో ఉంటారు మరియు మన ప్రపంచంలో చాలా తక్కువ శారీరక సమైక్యతను కలిగి ఉంటారు - వారు పాఠశాలకు వెళ్లరు, ఉద్యోగాలు పొందరు లేదా కుటుంబాలను పెంపొందించుకోరు. "వీరందరు (దేవదూతలు) రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు" (హెబ్రీయులకు 1:14).
వారు వివాహం చేసుకొని పిల్లలు కనాలనుకున్నా, వారు కనలేరు, వారికి మానవ డిఎన్ఎ (కణ జన్యుపదార్ధము) లేదు. దేవదూతలు ప్రజలను వివాహం చేసుకోవడం కంటే జెల్లీ చేప అడవి మేకను వివాహం చేసుకోవడం, సులభం. అందువల్ల, ఆదికాండములోని మన వాక్యభాగము మానవులకు పడిపోయిన లేదా పరిశుద్ధమైన దేవదూతలకు వివాహాన్ని సూచిస్తుందని నమ్మడానికి ఎటువంటి ఆచరణాత్మక అర్ధమూ లేదు.
దేవదూతలు పుట్టరు. వారు సృష్టించబడతారు. దేవుడు ఎక్కువ మంది దేవదూతలను కోరుకుంటే, పునరుత్పత్తి చేయడానికి ఆయన వారిని మానవులకు లేదా ఇతర దేవదూతలతో వివాహం. జరిగించాల్సిన అవసరం లేదు. ఆయన వారిని మొదటి నుండి సృష్టించగలడు. లూసిఫర్ గురించి దేవుడు ఇలా అన్నాడు, "నీవు నియమింపబడిన (లేదా, సృష్టింపబడిన) దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి" (యెహెజ్కేలు 28:13).
అంతేకాక, దేవదూతలు వివాహం చేసుకోరని యేసు స్పష్టంగా చెప్పెను. వివాహం అనేది మానవజాతి కొరకు ప్రత్యేకించబడిన ఒక ప్రత్యేకమైన మానవ వ్యవస్థ. "పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లి కియ్యబడరు, వారు పరలోకమందున్న దూతలవలె (దేవుని దూతలవలె) ఉందురు" (మత్తయి 22:30). మార్కు మరియు లూకా ఇదే విషయాన్ని సూచిస్తున్నారు : "వారు దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు" (లూకా 20:36, కొన్ని అనువాదాలు దీనికి "దేవుని కుమారులు" అని అర్థాన్నిస్తున్నాయి). యేసు ప్రభువు దేవదూతలు మరియు దేవుని కుమారులు మధ్య వ్యత్యాసం ఉందని ఇక్కడ చెప్పడం గమనించండి, వారు విడిగా వర్గీకరించబడ్డారు, అనగా వారు ఒకే విషయం కాదు.
కాబట్టి దేవుని కుమారులు దేవదూతలు కాకపోతే, వారు ఎవరు లేదా వారు ఏమిటి?
అంతరిక్ష సంబంధమైన జీవితమా?
మన వాక్యభాగములో దేవుని కుమారులు అంతరిక్ష ఆక్రమణదారులు కానప్పటికీ, విశ్వములో ఇతర జీవితం ఉందని బోధిస్తున్నట్లు బైబిల్ కనిపిస్తుంది. యేసు ఇతర గ్రహాలను సృష్టించాడని బైబిలు గ్రంథంలో స్పష్టంగా ఉంది. 'దేవుడు "ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను” (హెబ్రీయులకు 1:2).
తప్పిపోయిన గొర్రెల ఉపమానంలో, భూమి నశించిన గొర్రెను, దారితప్పి సంచరిస్తున్నప్పుడు, క్రీస్తు రక్షించడానికి వచ్చిన ప్రపంచాన్ని సూచిస్తుంది. దేవుడు తన అనంతమైన ఉనికిలో, ఇతర భౌతిక జీవులతో ఇతర ప్రపంచాలను సృష్టించాడని ఊహించటం సులభం. వాస్తవానికి, మన ప్రపంచానికి ముందు ఆయనకు సెరాపులు కెరూబులు మరియు ఇతర దేవదూతలు ఉన్నారని మనకు తెలుసు. కాబట్టి కనీసం ఆ గ్రహాంతర జీవులు కూడా ఉన్నాయని మనకు తెలుసు. “ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన .. ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను” (కొలొస్సయులకు 1:16). "అంతట పరలోకమందును భూలోకమందును ఉన్న ప్రతి సృష్టము, ... సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని!” (ప్రకటన 5:13),
ఏదేమైనా, ఈ ఇతర సృష్టించిన జీవులలో చాలా మంది ఈ ప్రపంచాన్ని సందర్శించకపోవచ్చు. భూమి (కరోనా వైరస్ కంటే భయంకరమైన) పాపం అనే ప్రాణాంతక అంటు వ్యాధితో బాధపడుతుందని మీరు అనవచ్చు. మరియు మనము (మన ప్రపంచం) అనే గృహ నిర్బంధంలో ఉన్నాము. నిర్బంధమైన ఆసుపత్రి వార్డులోకి వెళ్ళడానికి అనుమతించబడినది అసుపత్రి సిబ్బంది మాత్రమే, ఈ సందర్భంలో, దేవుడు ప్రధాన వైద్యుడు, మరియు ఆయన దేవదూతలు పరిచర్య చేసే ఆత్మలు.
గ్రహాల యువరాజులు
వేల సంవత్సరాల క్రితం, పరలోకంలో ఒక చమత్కారమైన "గ్రహాంతర" సమావేశం జరిగింది. "దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను" (యోబు 1:6).
ఈ సమావేశానికి హాజరైనప్పుడు దేవుని కుమారులు, అలాగే సాతానుడు కూడా ఉన్నాడు. తాను భూమి నుండి వచ్చానని సాతానుడు చెప్పాడు. దేవుని కుమారులు దేవుని విశ్వంలో వారి పడిపోని ప్రపంచాలను సూచిస్తున్నారు. భూమిని సూచించడానికి సాతానుడు భూప్రతినిధిగా అక్కడ ఉన్నాడు. సాతానుడు మన ప్రపంచానికి ఎందుకు ప్రతినిధిగా ఉంటాడు? వాస్తవానికి, ఆదాము భూమిపై ఆధిపత్యం కలిగి ఉన్నాడు. దానిని లోబరుచుకొని ఏలడానికి మరియు నిర్వహించడానికి దేవుడు అతనిని సృష్టించాడు. దేవుడు ఆదాము హవ్వలతో, "సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను" `(ఆదికాండము 1:28).
ఆదాము దేవునికి విధేయత చూపిస్తున్నప్పుడు, అతడు ప్రపంచమంతా తన ఆధిపత్యాన్ని ఆస్వాదించాడు. కానీ ఆదాము పాపం చేసి సాతానుకు విధేయత చూపిన తరువాత, ఆ ఆధిపత్యం శత్రువుకు పోయింది. "లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని" (రోమీయులకు 6:16).
యేసు కూడా సాతానుడిని “ఈ లోకాధికారి” అని పేర్కొన్నాడు. (యోహాను 12:31). వాస్తవానికి, మత్తయి 4:8-10లో, సాతానుడు భూమి యొక్క ఆధిపత్యాన్ని యేసుకు బదిలీ చేయడానికి ప్రతిపాదించాడు అయితే అది యేసు అతనికి నమస్కరించి ఆరాధిస్తేనే. తన భూఆధిపత్యాన్ని ఇవ్వడానికి అది తనది కాకపోతే సాతానుడు దానిని ఇవ్వలేడని అర్ధమే. కాబట్టి దేవుడు ప్రపంచ ప్రతినిధులు లేదా “దేవుని కుమారుల” సమావేశాన్ని పిలిచినప్పుడు, సాతానుడు భూమికి ప్రతినిధిగా వెళ్లాడు.
లూకా సువార్తలో, యేసు యొక్క వంశావళి ఆదాము వరకు గుర్తించబడింది. ఈ వంశావళి గురించి లూకా ఏమి చెప్పుచున్నాడో గమనించండి : "కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు" (లూకా 3:38),
షేతు మరియు ఆదాము మధ్య వ్యత్యాసం నాభి బిందువు (బొడ్డు). ఆదాము దేవుని చేతితో సృష్టించబడ్డాడు. షేతు హవ్వ నుండి జన్మించాడు. ఆదాము దేవునికి కుమారుడు, భూమిపై అధికారము కలిగి ఉండటానికి సృష్టించబడ్డాడు. ఈ విధంగా, దేవుని కుమారులకు ఒక నిర్వచనం ఏమిటంటే, దేవుడు తాను సృష్టించిన ప్రపంచాలపై అధికారము కలిగి ఉండటానికి సృష్టించబడిన జీవులు. ఈ జీవులు పుట్టలేదు కాని దేవుడే ప్రత్యక్షంగా సృష్టించాడు.
యోబు 38.7 మన ప్రపంచం సృష్టించబడినప్పుడు, "ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు" అని చెప్పుచున్నది. చెప్పబడిన "ఉదయ నక్షత్రములు" దేవదూతలు, అయితే "దేవుని కుమారులు" ఇతర ప్రపంచాలకు నాయకులు లేదా ప్రతినిధులు, (ప్రకటన 1:20 చూడండి.)
అది స్పష్టం అయ్యింది గనుక, "దేవుని కుమారులు" అనే మాట ఉపయోగించబడిన రెండవ విధాన్ని గురించి మాట్లాడుదాం..
నీతికి వారసులు
దేవుని కుమారుల యొక్క ఇతర అర్థం దేవుని ఆత్మ ద్వారా మరల సృష్టింపబడిన మానవులను సూచిస్తుంది.
"దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు. దేవుని కుమారులై యుందురు" (రోమీయులకు 8:14) మత్తయి. 5:9 దీనికి జతచేస్తుంది. "సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు". ఇక్కడ యేసు స్పష్టంగా మానవులను సూచిస్తున్నాడు. కానీ ఎవరు పడితే ఆ మానవుడు కాదు, వీరు సమాధానపరచువారు, నీతిమంతులైన దేవుని బిడ్డలు. దేవదూతలను లేదా గ్రహాంతరవాసులను సూచించడానికి ఇది ఏ విధంగానూ ఉండకూడదు.
"తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” (యోహాను 1:12). దేవుని కుమారులు కానివారు ఉన్నారని, అయితే వారు ఆయనను స్వీకరించడం ద్వారా దేవుని కుమారులు అయ్యారని గమనించండి. "దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు” (రోమీయులకు 8:14).
"దేవుని కుమారులు" అంటే మగవారు మాత్రమే కాదు. చాలా బైబిల్ అనువాదాలు "దేవుని పిల్లలు" అనే మాటను అందిస్తాయి. గలతీయులకు 3.26, "యేసుక్రీస్తు నందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారులైయున్నారు" అని చెప్పుచున్నది. విశ్వాసం ద్వారానే పురుషుడు లేదా స్త్రీ “దేవుని బిడ్డ" అవుతారు. మరియు, కొన్ని వచనాలు దేవుని దత్తపుత్రులు మరియు పుత్రికలు అని కూడా పేర్కొంటాయి. "నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను" (యెషయా 56:5).
"మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను. మరియు మీరు కుమారులై ఎక్కడ నుండి వచ్చింది?" మీ సమాధానం పొందడానికి మీరు చదువుతూ ఉండవలసిన మరో ఉదాహరణ ఇది. ఆదాము హవ్వలకు చాలా మంది కుమారులు, కుమార్తెలు ఉన్నారని ఆదికాండము 5:4 చెప్పుచున్నది. మీరు ఆదాము మాదిరిగా 930 సంవత్సరాలు జీవించి ఉంటే, మరియు మీరు మీ జీవితంలో 20 శాతం మాత్రమే ఆరోగ్యంగా, సాఫల్యవంతంగా సంతానోత్పత్తి కలిగి ఉంటే, మీకు ఇంకా 200 సంతాన సంవత్సరాలు ఉంటాయి. ఫలించి అభివృద్ధి చెందుడి అనే దేవుని ఆజ్ఞతో, ఆదాము హవ్వల యొక్క సంతానం చాలా ఎక్కువ అయ్యింది.
ఆదిమ తరాల వారు అనుభవించిన పరిపూర్ణ తేజస్సు మరియు ఆరోగ్యాన్ని పరిశీలిస్తే అలాగే, వారు బహుశా పిల్లల సమూహాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి కయీను నిస్సందేహంగా తన చాలా మంది సోదరీమణులలో ఒకరిని తన భార్యగా తీసుకున్నాడు. బైబిల్ చరిత్రలో ఈ సమయంలో, మనిషి యొక్క జన్యు శక్తి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, ఆచరణను నిషేధించేది ఏదీ లేదు. అబ్రాహాము తన చెల్లిని వివాహం చేసుకున్నాడు. (ఆదికాండము 20:2). ఇస్సాకు తనకు వరుసకు చెల్లి అయ్యే రిబ్కాను వివాహం చేసుకున్నాడు. మోషే కాలం వచ్చేసరికి ఒక సోదరిని వివాహం చేసుకోవడం నిషేధించబడింది. ఎందుకనగా జన్యు బలహీనత మరియు సంతానంతో ఆరోగ్య సమస్యలకు ఎక్కువ ప్రమాదం ఉంది (ద్వితీయోపదేశకాండము 27:22).
మొదట, ఆదాము హవ్వలకు కయీను, హేబెలు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కయీను హేబెలును హత్య చేశాడు. కాబట్టి దేవుడు ఆదాము హవ్వలకు మరో కుమారుడు షేతును ఇచ్చెను. అతడు తన సొంత పిల్లలను కలిగి ఉండడం మొదలుపెట్టాడు, మరియు వారు "యెహోవా నామమున ప్రార్ధన చేయుట ఆరంభమైనది" (ఆదికాండము 4:25, 26), మరియు మనం బైబిల్లో చూసిన దాని నుండి, ప్రభువు నామమున ప్రార్థించే వారిని దేవుని కుమారులు అంటారు. "తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను" (యోహాను 1:12), "ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు" (అపొస్తలుల కార్యములు 2:21).
కయీను తన సోదరుడిని హత్య చేసిన తరువాత దేవుని సన్నిధి నుండి బహిష్కరించబడ్డాడు. అతడు “ఏదెనుకు తూర్పుదిక్కున నోదు. దేశములో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి 2 ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను" (ఆదికాండము 4:16-17).
ఇక్కడ, జలప్రళయమునకు ముందు, మనకు పట్టణాలలో నివసిస్తున్న కయీను వారసులు మరియు దేశంలో లేక గ్రామాలలో నివసిస్తున్న షేతు వారసులు ఉన్నారు. వారు వేరుగా ఉన్నంత కాలం, దేవుని కుమారులు వారి మత విశ్వాసాలు మరియు ఆచారాలలో పవిత్రముగా ఉన్నారు.
అయితే, చివరికి వారు కలిసిపోవటం ప్రారంభించారు. దేవుని కుమారులకు నరుల కుమార్తెలు నివసించే పట్టణాల్లో మరింత తేలికగా పొందగలిగే సామాగ్రి అవసరం కావచ్చు. దేవుని కుమారులు మరియు నరుల కుమార్తెలు ఒకరికొకరు పరిచయమయ్యారు, . స్నేహపూర్వకంగా కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ, త్వరలోనే షేతు యొక్క దైవిక కుమారులు, లేదా దేవుని కుమారులు, కయీను యొక్క సుందరమైన కుమార్తెలచేత ఆకర్షించబడ్డారు, ఈ "నరుల కుమార్తెలు". కయీను వారసులను వివాహం చేసుకోవడం ప్రారంభించారు.
ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుని కుమారులు తమ నైతిక స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండా భార్యలను శారీరక ఆనందానికి ఇష్టమయ్యే స్త్రీలను తీసుకోవటానికి ఎంచుకున్నారు. వారు మంచి సలహాలను విస్మరించారు మరియు వారి తల్లిదండ్రుల సమ్మతిని పొందలేదు, లేదా వారు దేవునితో సంప్రదించి, ఈ విషయంలో ఆయన చిత్తాన్ని పరిగణించలేదు.
అన్యమత వివాహములు
దేవుని కుమారులు మంచి ఉద్దేశ్యాలతో ఈ పరిస్థితిలోకి వెళ్లడం కూడా చాలా సాధ్యమే. ఈ కయీను కుమార్తెలను తమ దేవుడైన యెహోవాకు పరిచయం చేసి వారిని మార్చగలమని కూడా వారు నమ్మియుండవచ్చు. కయీను కుమార్తెలు చివరికి తాము ప్రభువును అనుసరిస్తామనే వాగ్దానాలతో కూడా దేవుని కుమారులను ప్రలోభపెట్టి యుండవచ్చు.
అయితే, దేవుని సూచనలు స్పష్టంగా లేవు :
దేవుని “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వానికి పాలెక్కడిది? ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము, అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునైయుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు” (2 కొరింథీయులకు 6:14-18).
అందమైన ముఖం, చక్కని స్వభావం లేదా ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి మక్కువ కలిగి ఉన్నప్పటికీ, తన పిల్లలు మారుమనస్సు పొందని లేదా అవిశ్వాసులను వివాహం చేసుకోవాలని దేవుడు కోరుకోడు. ఇది ఎటువంటి మార్పును తీసుకురాదు, అట్టి సంబంధాలలో సమస్యలు ఉంటాయని దేవుడు చెప్పెను.
ఆయన కరుణామయుడని దేవునిని స్తుతించండి. కొన్నిసార్లు మన తిరుగుబాటు మరియు చెడు నిర్ణయాలు ఉన్నప్పటికీ ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. విశ్వాసులు అవిశ్వాసులను వివాహం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి మరియు అవిశ్వాసి చివరికి మారొచ్చు. అయినా సరే అవిశ్వాసులను పెళ్లి చేసుకోవడం ఇంకా తప్పు. దేవుని మాటలు నిస్సందేహంగా ఉన్నాయి : అసమానంగా కాడి వేయబడవద్దు. కానీ పశ్చాత్తాపం మరియు సమర్పణతో దేవుడు క్షమించును. అది నిజం కాకపోతే, మనలో చాలా మందికి నిరీక్షణ ఉండదు. దేవుడు కొన్నిసార్లు మన చెడు ఎంపికల యొక్క పరిణామాలను తొలగిస్తాడు, కాని ఆయన సూచనను తెలిసి విస్మరించడం అవివేకం. మనుష్యుల హృదయాల ఆలోచనలన్నీ.
నిరంతరం చెడుగా ఉన్నప్పుడు ప్రపంచంలో గొప్ప దుష్టత్వానికి దారితీసే సమస్యలో మీరు భాగమవుతారు.
కాబట్టి ఈ అన్యవివాహాల యొక్క ఫలితాలు "నెఫీలులు" (పెద్ద సమస్యలు, అసాధారణ ఎత్తుగల బలాఢ్యులు) మాత్రమే కాదు, దుఃఖాన్ని కూడా మిగుల్చుతాయి. దేవుని కుమారులు నరుల కుమార్తెలను ప్రభావితం చేసే బదులు, నరుల కుమార్తెలు దేవుని కుమారులను ప్రభావితం చేశారు.
“నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహెూవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును” (ద్వితీయోపదేశకాండము 7:3, 4).
దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కలవడం మరియు దాని ఫలితంగా వచ్చే విపత్తుల గురించి బైబిల్ నిండి ఉంది. దేవుడు ఎన్నుకున్న సంసోనును ఫిలిష్తీయులు పట్టాలు తప్పించారు. అన్యమత వధువును వివాహం చేసుకోవద్దని అతని తల్లిదండ్రులు అతనితో ప్రతిజ్ఞ చేయించారు, కాని అతడు కోరుకున్నది కావాలని పట్టుబట్టాడు. "వారు నీ స్వజనుల కుమార్తెల లోనేగాని నా జనులలోనేగాని స్త్రీ లేదను కొని, సున్నతి పొందని ఫిలిష్తీయులలోనుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్లుచున్నావా? అని అతని నడిగిరి. అందుకు సమ్సోను ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నాకొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను” (న్యాయాధిపతులు 14:3).
అదేవిధంగా, సొలొమోను రాజు అన్యమత దేశాల నుండి కుమార్తెలను వివాహం చేసుకొని తన అధిగమించలేని జ్ఞానంతో వారిని మార్చగలడని నమ్మాడన్నది నిస్సందేహం. అయితే, ఆ అన్యమత కుమార్తెలు సొలొమోను హృదయాన్ని దేవునికి దూరం చేసారు. దేవుడు తన పిల్లలు అవిశ్వాసులను వివాహం చేసుకోకపోవడం పట్ల మొండిగా ఉన్నాడు. విశ్వాసి క్రమంగా అవిశ్వాసి చేత రూపాంతరం చెందుతాడు, అవిశ్వాసి విశ్వాసి చేత కాదు.
ఈ అంత్య కాలంలో యేసు కూడా మనకు ఒక హెచ్చరికను
చేస్తున్నాడు :
"నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును అలాగే ఉండును, జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండిరి" (మత్తయి 24:37, 38).
ఇక్కడ యేసు ప్రభువు ఆదికాండము 6 లోని అన్య వివాహాలను సూచిస్తున్నాడు. అది జలప్రళయమునకు దారితీసే సార్వత్రిక దుష్టత్వాన్ని తెచ్చిపెట్టింది.
నోవహు దినముల మాదిరిగానే, జలప్రళయమునకు ముందు, నీటితో వరదలతో ప్రపంచాన్ని నాశనం చేయడానికి దారితీసిన విషయాలు మళ్లీ జరగబోతున్నాయి. యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు అగ్నిప్రళయము ద్వారా ప్రపంచాన్ని నాశనం చేయడానికి ముందు ఏమి జరగబోతుందో తెలియడానికి జలప్రళయమునకు ముందు జరిగిన సంఘటనలు ప్రత్యేక దృశ్యం. చరిత్ర కూడా పునరావృతం కానుంది, కాని మనము పునరావృతమయ్యే అవరాధులలో ఉండవలసిన అవసరం లేదు.
బహుభార్యాత్వము
దేవుని కుమారులు మరియు నరుల కుమార్తెల మధ్య అన్య వివాహాలు అవిధేయత యొక్క ఫలితం మాత్రమే కాదు. అదికాండము 62 లో, “తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి” అని చదువుతాము. బహుభార్యాత్వం ప్రారంభమైన ప్రదేశం కూడా "లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను, వారిలో ఒక దాని పేరు ఆదా రెండవదాని పేరు సిల్లా" (ఆదికాండము 4:19). కయీను కుమారులలో లెమెకు ఒకడు, అతడు ఇద్దరు భార్యలను తీసుకున్నాడు. కనుక ఇది దేవుని ఇష్టానికి విరుద్ధంగా ఒకరి విశ్వాసం నుండి వివాహం చేసుకోవడం కాదు, ఇది ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవడం. వివాహం యొక్క పవిత్రత కాలం ప్రారంభంలో కూడా కోల్పోతోంది.
ఇది నేడు మన ప్రపంచంలో జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇది మరింత దిగజారిపోయింది!
ఉదాహరణకు, సిస్టర్ వైవ్స్ (సహ భార్యలు) అని పిలువబడే ఒక ప్రముఖ అమెరికన్ రియాలిటీ టీవీ కార్యక్రమం, ఉటాలోని లెహిలో నివసిస్తున్న ఒక బహుభార్యాత్వ కుటుంబం యొక్క జీవితాన్ని ప్రసారం చేస్తుంది, ఇందులో వ్యక్తి. కోడి బ్రౌన్, అతని నలుగురు భార్యలు మరియు వారి 16 మంది పిల్లలు ఉన్నారు. మొదటి మరియు పద్నాలుగో సవరణల ఆధారంగా వారు తమ హక్కుల ఉల్లంఘన చేశారని బ్రౌన్ కుటుంబం దాని పెద్ద చట్టాల కారణంగా ఉటా రాష్ట్రంపై దావా వేసింది. ఒకే దేశం వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పే వ్యక్తుల కొరకు ఒకే వాదనలు ఉపయోగించబడుతున్నందున దేశం మొత్తం చూస్తూ ఉంది, ఆ అభ్యంతరం లేకుండా, ఒక వ్యక్తి ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులతో ప్రేమలో ఉన్నాడని సులభంగా చెప్పవచ్చు.
దేవుని కుమారులు ఒకే తల్లి, ఒకే తండ్రి అని కుటుంబం కొరకు దేవుని రూపకల్పన అనే వారి వివాహ ప్రమాణాల పవిత్రతను,వారి విశ్వాసం యొక్క విశిష్టతను, స్త్రీపురుషుల మధ్య వ్యత్యాసం యొక్క ప్రాముఖ్యతను తిరస్కరించినప్పుడు, హింస త్వరలోనే భూమిని మరియు ఆలోచనలను నిండింది, మనుష్యుల హృదయాలు నిరంతరం చెడుతో మాత్రమే నిండియున్నవి. ఇది “మనుష్యకుమారుని రాకడకు ముందు" అంత్య కాలంలో మళ్ళీ జరుగుతుందని యేసు చెప్పెను.
ఆ సమయం రానే వచ్చింది. టీవీని పెట్టి, దాదాపు ఏ ఛానల్ నైనా మార్చి చూడండి, మీరు అనైతికత, వక్రబుద్ధి, విడాకులు, వంచన మరియు మొత్తం హింసను చూస్తారు. చంపడం మరియు హత్య చేయడం చుట్టూ చాలా కార్యక్రమాలు నిర్మించబడ్డాయి, వివాహం యొక్క పవిత్రత నిరంతరం ఎగతాళి చేయబడుతోంది.
కానీ దేవుడు, “యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు. అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను” అని చెప్పెను (ఆదికాండము 6:3). దేవుడు భవిష్యత్తును పరిశీలించి, ఈ దుర్మార్గపు మనుష్యులను ఆ భవిష్యత్తు ఎక్కడికి నడిపిస్తుందో చూశాడు మరియు అది అంతం కావాలని నిశ్చయించుకున్నాడు. తరువాత క్రీస్తు, “ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును" అని చెప్పెను (మత్తయి 24:22).
అంత్య కాలంలో, ఏర్పరచబడినవారి కొరకు దేవుడు ఇది మళ్ళీ చేయవలసి ఉంటుంది. 120 సంవత్సరాలు, దేవుని ఆత్మ. నోవహు మరియు అతని కుటుంబం యొక్క బోధ మరియు మాదిరి ద్వారా, పాపంతో బానిసత్వం చేయబడిన ఆ తరంతో వాదించారు. వారు వినడానికి నిరాకరించారు. నోవహు మరియు అతని కుటుంబం ఓడలోకి ప్రవేశించి, తలుపు మూసివేయబడినప్పుడు, లోపల ఎనిమిది మంది మాత్రమే దేవుణ్ణి నమ్మినవారు ఉన్నారు. మిగిలిన వారికి పరిశీలన మూసివేయబడింది. కలిసిపోయిన కయీను మరియు షేతు జాతి కొరకు మరో ఏడు రోజులు జీవిత మనుగడ ఓడకు బయట సాగింది. అతని వారసులు తమ పవిత్రతను త్యాగం చేసి తమను తాము చెడుకు అప్పగించుకున్నారు. నేడు మీరు పరిశుద్ధులుగా ఉన్నారా? దేవుడు మీతో, “నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు" అని అంటాడు. మీరు వింటారా?
ఒక పెద్ద సమస్య
దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్న ఫలితంగా జన్మించిన "నెఫీలులు (బలాఢ్యులు)" గురించి నేను మాట్లాడటం మర్చిపోయానని మీరు అనుకోవచ్చు. దేవుని కుమారులు కేవలం షేతు యొక్క నీతి సంతానం మరియు నరుల కుమార్తెలు కయీను యొక్క స్త్రీ వారసులు అయితే, ఈ కలయిక పిల్లలు ఎందుకు నెఫీలులు మరియు శక్తివంతులై యున్నారు? ఈ దురదృష్టకర మానవ వివాహాల సంతానం గురించి మనం ఎలా వివరించాలి?
సరే. ఇది "జన్యు శక్తి" అని పిలువబడే ప్రదర్శనలోని జన్యుశాస్త్రం యొక్క సాధారణ ధర్మం అని నేను నమ్ముతున్నాను.
ఆదిలో, నెఫీలులు (అసాధారణ ఎత్తుగల బలాఢ్యులు) ఎల్లప్పుడూ కనబడుతూ ఉండేవారు.
ఉదాహరణకు, 1918 లో ఇల్లినాయిస్లోని ఆల్టన్లో జన్మించిన రాబర్ట్ వాడ్లోను తీసుకోండి. పుట్టినప్పుడు అతడు సాధారణ ముప్పావు కిలోల బరువు, ఆరు నెలల్లో, అతని బరువు 15 కిలోలకు పెరిగింది. ఒక సంవత్సరం తరువాత, 18 నెలలు వయసులో, అతని బరువు 35 కిలోలు, అతడు లావుగా లేడు, పొడవైయ్యాడు. అతడు ఎనిమిది సంవత్సరాల వయస్సులో 6 అడుగుల 2 అంగుళాలు మరియు 195 కిలోలకు చేరుకున్నాడు. అతడు 13 ఏళ్ళ వయసులో, ప్రపంచంలోనే ఎత్తైన అబ్బాయి అయ్యాడు. 13 ఏళ్ళ వయసులో, అతడు 7 అడుగుల 4 అంగుళాల పొడవు. చివరికి, రాబర్ట్ దాదాపు 9 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు! (పోలికలో, గొల్యాతు సుమారు 9 అడుగులు, 6 అంగుళాలు.) రాబర్ట్ యొక్క ఎత్తు అతన్ని ఆధునిక చరిత్రలో ఎత్తైన వ్యక్తిగా అర్హత సాధించింది.
కానీ ఈ భారీ కీర్తి అతనికి ఎల్లప్పుడూ సులభం కాదు. అతని దుస్తులకు సాధారణ వస్త్రం యొక్క మూడు రెట్లు అవసరం, మరియు = అతని పరిమాణం 37 బూట్లు ఒక జతకి లక్షల్లో ఖర్చు అవుతాయి - మరియు అది తీవ్రమ్మెన మాంద్యం సమయంలో తిరిగి వచ్చింది. రాబర్ట్ 20 ఏళ్ళ వయసులో, ఇంటర్నేషనల్ షూ కంపెనీ తనకి బూట్లు ఉచితంగా అందించింది మరియు సంస్థను ప్రోత్సహించడానికి అతన్ని నియమించింది. అదంతా అతడు ఆదాయం కోసం చేసినది అంతే. అతడు 41 రాష్ట్రాల్లోని 800లకు పైగా పట్టణాలను సందర్శించాడు. మరియు తన సౌహార్ద పర్యటనలో 3,00,000 (3 లక్షల) మైళ్ళు ప్రయాణించాడు. బూట్ల కంపెనీ ఒక కారును సవరించవలసి వచ్చింది. తద్వారా అతడు లోపలికి వెళ్ళటానికి ముందు సీటును తీసివేసి, వెనుక కూర్చుని తన పొడవాటి కాళ్ళను చాపుకున్నాడు.
అతడు అమితమైన పరిమాణంలో ఉన్నప్పటికీ, అతడు చాలా మంచి స్వభావం గలవాడు. తెలివైనవాడు మరియు సున్నితమైనవాడు. ప్రజలు ఎల్లప్పుడూ అతనికేసి నోరు వెళ్లబెట్టి ఆశ్చర్యంగా చూస్తున్నారు. వారు అతనిని, "ప్రతి ఒక్కరూ మిమ్మల్ని వింతగా చూస్తే అది మీకు బాధ కలిగిస్తుందా?" అని అడుగుతారు. అతడు, "అదేం లేదు, నేను వాటన్నిటినీ పట్టించుకోను" అని సమాధానం ఇస్తాడు. అతడు సాధారణ జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాడు. తపాలా స్టాంపుల సేకరణ మరియు ఫోటోగ్రఫీని ఆస్వాదించాడు. అతడు తన ఫోటోలను తీసే వ్యక్తుల ఫోటోలను కూడా తీస్తాడు.
రాబర్ట్ ఒక ఆధునిక దిగ్గజం (అసాధార ఎత్తుగల వ్యక్తి), అతన్ని పుట్టించడానికి లేదా అతని "ఉనికిని వివరించడానికి పడిపోయిన దేవదూతలు లేదా గ్రహాంతరవాసులు అవసరం లేదు. దేవుని కుమారులు మరియు నరుల కుమార్తెల యొక్క పెద్ద సంతానం జన్యుశక్తి వల్ల సంభవించవచ్చు. కొంతమంది పసిఫిక్ ద్వీపవాసుల మాదిరిగానే ప్రజల సమూహం సంవత్సరాలుగా వేరుచేయబడి, ఒకరితో ఒకరు మాత్రమే వివాహం చేసుకున్నప్పుడు, జీన్ పూల్ (జన్యు సమీకరణ) పరిమితం అవుతుంది మరియు పుట్టుకతో వచ్చే లోపాలు మరియు జన్యుపరమైన అసాధారణతలకు ఎక్కువ అవకాశం ఉంది. ఈ తరహా ఒంటరితనం యొక్క అనేక తరాల తరువాత, వారు చివరకు తమ ద్వీపం లేదా తెగ వెలుపల వివాహం చేసుకున్నప్పుడు, ఆ సమూహాల పిల్లలు మరింత ఆరోగ్యంగా, దృఢంగా, మరియు, ఇంకా పెద్దగా ఉంటారు. ప్రపంచంలో అతిపెద్ద పిల్లులు, పులులు మరియు సింహాల మధ్య హైబ్రిడ్ (వేర్వేరు జాతి జంతువుల కలయిక వల్ల పుట్టిన జీవి) అయిన లైగర్స్ (సింహానికి ఆడపులికి కలిగిన సంతానము).
దత్తత ఎంపికలు
దేవుని కుమారుడు లేదా కుమార్తె అని చెప్పుకునే లేదా భావించుకునే ప్రతి ఒక్కరూ నిజంగా దేవుని కుమారుడు లేదా కుమార్తె కాదు.
ఆనాటి మత పెద్దలు అయిన పరిసయ్యులు తాము అబ్రాహాము పిల్లలు అని యేసుకు గొప్పగా చెప్పుకున్నారు. యేసు వారిని సరిదిద్దెను. యేసు మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు" అని చెప్పెను (యోహాను 8.39). ఈ ప్రకటన మీరు మొదట చదివినప్పుడు యేసు చెప్పడం ఎంత అపకీర్తి అని మీకు నిజమైన అవగాహన రాకపోవచ్చు కాని అది పరిసయ్యులను బహిరంగంగా అవమానపెట్టింది. వారు ఆయన ఎప్పుడు మరణిస్తాడా లేదా ఎప్పుడు చంపుదామా అని ఆత్రంగా ఎదురు చూశారు. యేసు అక్కడితో ఆగలేదు ...
“యేసు వారితో ఇట్లనెను దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే నచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా? మీరు మీ తండ్రియగు అపవాది (అనగా, సాతానుడు) సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు" (యోహాను 8:42-44).
మన నిజమైన వారసత్వాన్ని పరీక్షించడానికి ఇది ఒక సాధారణ సూత్రం. మన చర్యలలో మనం ఏ "తండ్రి" ను అనుసరిస్తున్నాము? పరిసయ్యులు సంఘంలో నాయకులు, అయినప్పటికీ అది వారికి భద్రత ఇవ్వలేదు. కేవలం యూదుల సభలో సభ్యుడిగా ఉండటం లేదా యూదులై ఉండటం వారిని దేవుని పిల్లలుగా చేయలేదు. నేడు, మీ సంఘంలోని పుస్తకాలపై చదవడానికి కూర్చొని ఉండటం ద్వారా అది మిమ్మల్ని దేవుని కుమారుడిగా లేదా కుమార్తెగా చేయలేరు. బదులుగా, మనం ఎవరికైతే విధేయత చూపుతామో వారి పిల్లలము. మనం ఎవరికి ఇష్టమైనవి చేస్తామో, వారే మన తండ్రి, నీతికైనా లేదా పాపానికైనా (రోమీయులకు 6:16).
ఇది చాలా తీవ్రమైనది. కాబట్టి మీరు ఎవరి పిల్లలు? మీరు దేవుని పిల్లలా?
"మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి బగుప్త ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానముందు దృష్టియుంచెను" (హెబ్రీయులకు 11:24-26).
దేవుడు పిలిచినప్పుడు, మోషే తన ఐగుప్తు దత్తతకు బదులు పరలోకపు దత్తతను కోరుకున్నాడు. యేసు ద్వారా, మీరు కూడా చేయవచ్చు.
“అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి, మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను. మరియు మీరు కుమారులై యున్నందున నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు" (గలతీయులకు 4:4-7).
జూన్ 10, 1991 న ఫిలిప్ గారిడో మరియు అతని భార్య నాన్సీ బస్ స్టాప్ వద్ద కిడ్నాప్ చేసినప్పుడు జేసీ లీ డుగార్డ్ వయసు 11 సంవత్సరాలు. ఆమె ప్రజల దృష్టి నుండి వేరుచేయబడిన నిశ్శబ్ద గదిలో ఉంచబడింది. క్రూరంగా బానిసగా ఉంచబడిన ఆమె 18 సంవత్సరాల పాటు గారిడోస్ కొరకు పిల్లలను కూడా కన్నది. కొంతకాలం తర్వాత, ఈ పరిస్థితి ఆమెకు సాధారణమైంది. ఇది సాధారణమైంది. ఆమె గారిడో కుటుంబంలో భాగమని ఆమె నమ్ముతుంది. కాని ఫిలిప్ మరియు నాన్సీ నిజంగా ఎలాంటి మిత్రులు అని ఆమె తరువాత తెలుసుకుంది. అదృష్టవశాత్తూ, ఆమె చివరికి కనుగొనబడింది మరియు ఆ భయంకరమైన స్థితి నుండి విడుదల చేయబడింది మరియు ఆమె నిజమైన కుటుంబానికి తిరిగి ప్రవేశపెట్టబడింది. జీవితం యొక్క పూర్తి మార్పు గురించి మాట్లాడండి!
అదేవిధంగా, ఈ ప్రపంచంలో దేవుని పిల్లలుగా ఉండవలసిన చాలా మందిని అపవాది అపహరణ చేశాడు. అతడు వారిని తీసుకొని దుర్వినియోగం చేసాడు మరియు వారు వారి నిజమైన కుటుంబంతో ఉన్నారని అనుకునేలా అతడు వారిని ఏమార్చాడు. సాతానుడి యొక్క అబద్ధాలు నిజం అని, అతడు వారి స్నేహితుడని వారు నమ్ముతారు. ఫిలిప్ గారిడో జేసీపై ఆ వాదనే చేశాడు. బహుశా మీరు కూడా అపవాదికి అలవాటుపడి ఉండవచ్చు, మీరు అతని కుటుంబంలో భాగమని మీరు అనుకుంటారు. మీరు అతని చుట్టూ ఉండటం సౌకర్యంగా మారింది. కానీ అతడు అపహరణ చేసేవాడు. దుర్వినియోగం చేసేవాడు. మీరు స్వతంత్రులుగా ఉండగలరని యేసు చెప్పడం మీరు మేల్కొని వినాలి.
ఫిలిప్ గారిడోకు 431 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అతని భార్యకు 36 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. జేసీకి రాష్ట్రం నుండి సుమారు 2 కోట్ల నష్ట పరిహారం లేదా పరిష్కారం లభించింది, అదనంగా ఒక పెద్ద పుస్తక ఒప్పందం. ఆమె తన జీవితాంతం తన డబ్బును చక్కగా నిర్వహిస్తే ఆమె ఆర్థికంగా బాగానే ఉంటుంది. కొంతమంది వక్రబుద్ధి గలవారి పెరటిలో ఒక గుడిసెలో నివసించడం నుండి విముక్తి పొందడం, మీ నిజమైన కుటుంబాన్ని కనుగొనడం, పరిశుభ్రమైన జీవితాన్ని గడపడం, సాధారణ జీవితాన్ని గడపడం మరియు అకస్మాత్తుగా పేదరికం నుండి ధనవంతుల వరకు వెళ్ళడం ఎంత అదృష్టం. ఎంత పరిపూర్ణ పరివర్తన!
ప్రభువు మన కొరకు అదే చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం, మీరు రారాజు బిడ్డగా, నిత్యజీవానికి వారసుడిగా ఉండటానికి ఎన్నుకోవచ్చు మరియు నిన్ను బట్టి ఆయన బాగా ఆనందించే దేవుని కుమారుడు లేదా కుమార్తెగా నీవు మారవచ్చు! కేవలం ఆయనను అడిగి చూడండి.
మనం (మారుమనస్సు ద్వారా) మరల జన్మించి, దేవుని కుటుంబంలోకి దత్తత తీసుకొనబడిప్పుడు, మన పరలోకపు తండ్రిని అనుకరించాలని కోరుకుంటాము. "ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు” (1 యోహాను 2:6).
మీరు ఇప్పుడు దేవుని కుమారుడు లేదా కుమార్తె కాకపోతే, అద్భుతమైన వార్త ఏమిటంటే మీరు క్రొత్త కుటుంబాన్ని ఎన్నుకోవచ్చు.

